జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
కలెక్టరును కలిసిన టీఎన్జీఓ ప్రతినిధులు
✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా (జూన్ 18)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన జితేష్ వి పాటిల్ మంగళవారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు సముదాయంలో కలెక్టర్ ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ను టీఎన్జీఓ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అమరనేని రామరావు, కార్యదర్శి కె.సాయిభార్గవ్, చైతన్య కేంద్ర సంఘం కార్యదర్శి జి.వీరబాబు, కోశాదికారి జె.సోమయ్య, జాయింట్ సెక్రటరీ జి ఉష, ఎస్.ఉషారాణి, ఎస్కే జానిమియా, రాజు, హాస్టళ్ల సంక్షేమాధికారులు నరసింహరావు, రాంబాబు, కబీర్, పవన్, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

