Divitimedia
AMARAVATHIAndhra PradeshBusinessCrime NewsLife StyleNational NewsSpot NewsTelangana

లంచం కేసులో బీఐఎస్ జేడీని అరెస్ట్ చేసిన సీబీఐ

లంచం కేసులో బీఐఎస్ జేడీని అరెస్ట్ చేసిన సీబీఐ

✍️ అమరావతి – దివిటీ (మార్చి 31)

ఆంధ్రప్రదేశ్ లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ రూ.70వేలు లంచం తీసుకుంటూ సోమవారం సీబీఐ చేతికి చిక్కారు. సిలిండర్ కు బీఐఎస్ మార్క్ కోసం ఓ తయారీ కంపెనీ దరఖాస్తు చేసుకోగా, రమాకాంత్ లంచం డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు అతడిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో విజయవాడ ఆటోనగర్ లో ఉన్న బీఐఎస్ కార్యాలయం కేంద్రంగా ఈ ప్రాంతంలో నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసుతో సంబంధముందనుకుంటున్న లక్ష్మీనారాయణరెడ్డి అనే మరో వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Related posts

టెట్ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

Divitimedia

అంగన్ వాడీ కేంద్రాలు ఓపెన్ చేయకపోతే పర్యవేక్షకులపై కఠిన చర్యలు

Divitimedia

దోమలవాగు చెరువు రిజర్వాయర్ గా తీర్చిదిద్దాలి

Divitimedia

Leave a Comment