Divitimedia
Bhadradri KothagudemEntertainmentHealthLife StyleSportsTelanganaYouth

ఉత్సాహంగా 2కె రన్, పాల్గొన్న కలెక్టర్

ఉత్సాహంగా 2కె రన్, పాల్గొన్న కలెక్టర్

✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 1)

రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంబరాల సందర్భంగా మొదటి రోజు ఆదివారం కొత్తగూడెంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి రామచంద్ర డిగ్రీకాలేజి వరకు సాగిన ఈ రన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, విద్యార్థులు, వాకర్స్, యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు..ఈ సందర్భంగా కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, ఆటలను బహుమతుల కోసమనే కాక ఇష్టంతో ఆడుకుంటామన్నారు. ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ రన్ నిర్వహించామని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని, శ్రద్ధ వహించాలని, ఉదయం నడక, రన్నింగ్ లాంటివి అవసరమన్నారు. క్రీడల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, పలు క్రీడాసంఘాల సభ్యులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

బూర్గంపాడులో పోలీసుల భారీవిజయం

Divitimedia

ఐటీడీఏ పరిధిలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ

Divitimedia

అర్థరాత్రి ఇసుక దొంగలు… అధికారుల కళ్లకు గంతలు…

Divitimedia

Leave a Comment