బకాయిలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం
కేంద్రమంత్రితో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
✍️ హైదరాబాద్, న్యూఢిల్లీ – దివిటీ (మార్చి 4)
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94కోట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రాష్ట్రం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును పొడిగించాలని కూడా వారు కోరారు.