పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత


✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 13)
సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీసులు హైదరాబాద్ పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టుకున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం… దాదాపు రూ.1కోటి విలువైన చైనా మాంజా స్వాధీనమైనట్లు తెలుస్తోంది. పాతబస్తీలో పతంగుల విక్రయాలు చేస్తున్న షాపుల్లో సోమవారం టాస్క్ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్లో భారీగా చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పోలీసులు జరిపిన సోదాల్లో 137 కేసులు నమోదు చేసిన పోలీసులు, 145 మంది నిందితులను (విక్రయదారులను) అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

