బీజేపీ మండల అధ్యక్షుడిగా సాయిశ్రీను
✍️ బూర్గంపాడు – దివిటీ (జనవరి 12)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షుడిగా బిరకా సాయిశ్రీనును పార్టీ నియమించింది. ఈ మేరకు తనను ఆ పదవిలో నియమించిన ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా బాధ్యులకు ధన్యవాదాలు తెలియ జేశారు. తనకు మండల అధ్యక్ష పదవి వచ్చేందుకు కృషిచేసిన నాయకులు జీవీకే మనోహర్, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భూక్య సీతారాం నాయక్, ఏనుగు వెంకట్ రెడ్డి, కన్నెదారి వరప్రసాద్, గుగులోత్ బాలునాయక్ లకు ధన్యవాదాలు తెలిపాడు. తనను నమ్మి మండల పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు చేపట్టి, మండలంలో పార్టీ అభివృద్ధి కోసం నాయకులు, సీనియర్ నాయకుల సలహా మేరకు అందర్నీ కలుపుకొని పనిచేస్తానని తెలియజేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

