ఎస్పీ కార్యాలయంలోనూ ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 20)
ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాకలెక్టర్ కార్యాలయంలో అవకాశం కల్పించిన విధంగానే జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి సోమవారం ఇకపై ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు వీలుగా “గ్రీవెన్స్ డే” ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి తెలియజేసేందుకు ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటామన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

