Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StyleSpot NewsTechnologyTelangana

కలెక్టరునే తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం

కలెక్టరునే తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం

పాల్వంచ మున్సిపల్ డీఈకి షోకాజ్ నోటీస్

త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరిక

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 12)

తాగునీటి సమస్యపై ప్రజలు కలెక్టరుకు ఫిర్యాదు చేస్తే, బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన ఓ ఉన్నతాధికారి ఏకంగా జిల్లాకలెక్టరునే తప్పుదోవ పట్టించేందుకు తీవ్ర స్థాయిలో విఫలయత్నం చేశారు. ఫలితంగా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మండలం ప్రశాంత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల బుధవారం పాల్గొన్నారు. తమకు తాగునీరు సరఫరా చాలాకాలం నుంచి అందడంలేదని
ఈ సందర్భంగా స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లాకలెక్టర్ మున్సిపల్ డీఈ మురళీకృష్ణ నుంచి వివరణ కోరగా, తాము త్రాగునీరు సరఫరా చేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో కలెక్టర్ దగ్గరలోని ఓ ఇంట్లోకి స్వయంగా వెళ్లి అక్కడ కులాయి తిప్పి మంచినీరు వస్తున్నదో? లేదో?నని పరిశీలించారు. అక్కడ ప్రజలను అడగగా తమకు త్రాగునీరు సరఫరా కావడంలేదంటూ తెలిపారు. త్రాగునీరు రావడంలేదనే విషయం నిర్ధారించుకున్న కలెక్టర్ డా.ప్రియాంకఅల, ఈ విషయంలో తప్పుడు సమాచారం అందించినందుకు మున్సిపాలిటీ డీఈ మురళీకృష్ణకు షోకాజ్ నోటీస్ జారీచేయవలసిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనకు ఆదేశాలు జారీచేశారు. తక్షణమే ఆ ప్రాంతంలో తాగునీటిసరఫరా పునరుద్దించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరాపై తనకు నివేదిక సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు కూడా అవసరమైతే ఉన్నతాధికారులను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తారనేందుకు ఈ సంఘటన అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

జిల్లాలో విపత్తు అధ్యయన బృందం విస్తృత పర్యటన

Divitimedia

గోదావరి వరద నేపథ్యంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు

Divitimedia

Leave a Comment