వివేకా హత్యకేసులో కుమార్తె సునీత పిటిషన్ కొట్టివేత
✍️ దివిటీ మీడియా (హైదరాబాద్)
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటికే సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని సునీత మరోసారి పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చింది.
చాలామంది అనుమానితులను సీబీఐ ప్రశ్నించాల్సి ఉందని సునీత పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నికోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేసి ముగించామని, కోర్టు ఆదేశిస్తే మరలా దర్యాప్తు చేస్తామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

