బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర రైలు ప్రమాదం
పరస్పరం ఢీకొన్న రెండు రైళ్లు, 20 మంది మృతి
✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం (అక్టోబరు 23వ తేది) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఆ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడంతో పలు భోగీలు తుక్కుతుక్కయ్యాయి. ఘోరమైన ప్రమాదం జరగడంతో దుర్ఘటనాస్థలంలో భీతావహపరిస్థితులు దర్శనమిస్తున్నాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో దుర్ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

