Divitimedia
Crime NewsKhammamLife StyleSpot NewsTechnologyTelanganaWELFAREYouth

పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఖమ్మం సీపీ

పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఖమ్మం సీపీ

✍️ దివిటీ మీడియా (ఖమ్మం)

నేరాల పరిశోధన, నిందితుల గుర్తింపు వేగవంతం చేయడానికి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి బాధిత ఫిర్యాదుదారులతో మాట్లాడారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, సీసీటీఎన్ఎస్ అప్లోడ్, జనరల్‌ డైరీ రికార్డులు, సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలను కూడా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్’లో వస్తున్న అధునిక పద్ధతులు అందిపుచ్చుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. పోలీసుస్టేషన్లలో డేటా ఎంట్రీ, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, సాంకేతికతను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ అత్యంతకీలకమన్నారు. జిల్లాలో వివిధరకాల నేరాలకు పాల్పడుతున్న వారిని కనిపెట్టేందుకు ఈ ప్రాజెక్టులో ప్రవేశపెడుతున్న నూతనపద్ధతులపైన పరిణతి సాధించాలని సూచించారు. ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టును సమర్థ వంతంగా ఉపయోగించాలని, తద్వారా క్రింది స్థాయి సిబ్బంది మరింత మెరుగ్గా వినియోగించే అవకాశముంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ- సమన్స్, ఈ- సాక్ష్య వంటివి విస్తృతంగా ఉపయోగించాలని వివరించారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేయాలని, వారిపై నిఘా కూడా పెట్టాలని ఆదేశించారు. ఈ
కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, కిందిస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మెడికల్ ఆఫీసర్ కు సీఐటీయూ వినతిపత్రం

Divitimedia

శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న జనక్ ప్రసాద్

Divitimedia

హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

Divitimedia

Leave a Comment