ఐటీసీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో వీరన్నకు సన్మానం
✍️ దివిటీ మీడియా (పినపాక)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ సంస్థలో ఉద్యోగ విరమణ చేసిన కాంట్రాక్ట్ కార్మికుల నాయకుడు వీరన్నను ఆ సంస్థ చీఫ్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరామారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మిక సంక్షేమంలో వీరన్న సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పెరుగు నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు నారాయణ సింగ్, పుట్టి శ్రీనివాసరావు, మాదాబత్తుల రమణ, బత్తుల రామకృష్ణ, బొడ్డు నాగరాజు, ఎండి యాకూబ్ సుభాని, ఐ.గోపాల్, సిహెచ్ స్వామి గౌడ్, సంగం క్లబ్ సెక్రటరీ బి.రాము, రాధాకృష్ణ పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

