‘గిరిజన దర్బార్’ కు అధికారులంతా రావాలి : ఐటీడీఏ పీఓ
✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 14
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెల 15(సోమవారం) నిర్వహించనున్న ‘గిరిజన దర్బార్’ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని పీఓ సూచించారు. యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశమందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

