సావిత్రిబాయి పూలేకి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం
✍️ మణుగూరు – దివిటీ (జనవరి 3)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులతోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు,స్త్రీ సాధికారతకోసం విశేషంగా కృషిచేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షుడు పిరినకి నవీన్, పార్టీ మణుగూరు, అశ్వాపురం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.