Divitimedia
Andhra PradeshBhadradri KothagudemBusinessCrime NewsLife StyleSpot NewsTelangana

కలపలారీని ఢీకొట్టిన టిప్పర్, ఇద్దరికి గాయాలు

కలపలారీని ఢీకొట్టిన టిప్పర్, ఇద్దరికి గాయాలు

దివిటీ మీడియా

✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు (మే 4)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మర్రికుంట వద్ద కలపలోడుతో వెళ్తున్న లారీని కంకరలోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి తర్వాత జరిగింది. ఈ ఘటనలో టిప్పర్ లారీ డ్రైవర్, క్లీనర్ గాయాల పాలైనట్లు తెలిసింది. మోరంపల్లిబంజర వారపుసంత దాటిన తర్వాత మర్రికుంట గ్రామ సమీపాన ఈ ప్రమాదం జరిగింది. ఏపీ కృష్ణా జిల్లా నందిగామ నుంచి కలప లోడుతో సారపాక వెళ్తున్న లారీని కంకర లోడుతో వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. వేగాన్ని అదుపు చేయలేక టిప్పర్ లారీ డ్రైవర్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ తీవ్రతకు ముందున్న కలపలారీ లోని కలప వెనుక ఢీకొట్టిన టిప్పర్ క్యాబిన్, వెనుక కంకర లోడు మీదకు వెళ్లిపోయింది. గాయాల పాలైన డ్రైవర్, క్లీనర్ చికిత్స పొందుతున్నారు.

Related posts

ఎస్బీఐ ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులుశెట్టి నియామకం

Divitimedia

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్ష

Divitimedia

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

Divitimedia

Leave a Comment