Divitimedia
Andhra PradeshBhadradri KothagudemBusinessCrime NewsLife StyleSpot NewsTelangana

కలపలారీని ఢీకొట్టిన టిప్పర్, ఇద్దరికి గాయాలు

కలపలారీని ఢీకొట్టిన టిప్పర్, ఇద్దరికి గాయాలు

దివిటీ మీడియా

✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు (మే 4)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మర్రికుంట వద్ద కలపలోడుతో వెళ్తున్న లారీని కంకరలోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి తర్వాత జరిగింది. ఈ ఘటనలో టిప్పర్ లారీ డ్రైవర్, క్లీనర్ గాయాల పాలైనట్లు తెలిసింది. మోరంపల్లిబంజర వారపుసంత దాటిన తర్వాత మర్రికుంట గ్రామ సమీపాన ఈ ప్రమాదం జరిగింది. ఏపీ కృష్ణా జిల్లా నందిగామ నుంచి కలప లోడుతో సారపాక వెళ్తున్న లారీని కంకర లోడుతో వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. వేగాన్ని అదుపు చేయలేక టిప్పర్ లారీ డ్రైవర్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ తీవ్రతకు ముందున్న కలపలారీ లోని కలప వెనుక ఢీకొట్టిన టిప్పర్ క్యాబిన్, వెనుక కంకర లోడు మీదకు వెళ్లిపోయింది. గాయాల పాలైన డ్రైవర్, క్లీనర్ చికిత్స పొందుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బూర్గంపాడులో 29న “భూభారతి” అవగాహన సదస్సు

Divitimedia

‘నేషనల్ స్పోర్ట్స్ డే’ సందర్భంగా ‘చలో మైదాన్”

Divitimedia

ఫ్రీబస్ స్కీమ్ ఎంతపని చేసిందో చూడండి…!

Divitimedia

Leave a Comment