సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, జనవరి 27
తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, అమీర్ అలీఖాన్ శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.