విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన శిక్షణ ఐఏఎస్ అధికారి
✍️ దివిటీ – భద్రాచలం (నవంబర్ 21)
భద్రాచలం జూనియర్ కళాశాలలో ఐఐటీ, జేసీ, నీట్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికిగాను సబ్ కలెక్టర్ చొరవతో జిల్లాలో శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి సౌరబ్ శర్మ గ్రూప్ మెయిన్స్ పుస్తకాలు పంపిణీ చేశారు. శిక్షణలో భాగంగా గురువారం రాత్రి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సౌరబ్ శర్మ ఈ చేయూతనందించారు. భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇటీవల సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ సందర్శించిన సందర్భంలో ఇక్కడి విద్యార్థులు ప్రవేశ పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన రిఫరెన్స్ పుస్తకాల కోసం అభ్యర్థించారు. దానిపై వెంటనే చర్య తీసుకుని, ఆ పుస్తకాలను ఏర్పాటు చేసి భద్రాచలం సబ్-కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులకు రిఫరెన్స్ పుస్తకాలు తన ద్వారా అందించడం చాలా సంతోషంగా ఉందని సౌరబ్ శర్మ అన్నారు. విద్యార్థులతో సంభాషించి ఐఐటీ, జేఈఈ, తదితర పరీక్షలకు సిద్ధం అయ్యే వ్యూహాలపై మార్గదర్శకత్వం అందించారు, క్రమశిక్షణతో కూడిన అధ్యయనపద్ధతులు అవలంబించాలని, అందుబాటులో ఉన్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భద్రాచలం సబ్-డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, విద్యార్థులు విద్య, కెరీర్ లక్ష్యాలలో రాణించడానికి అవసరమైన మద్దతునిస్తూ సబ్ కలెక్టర్ చూపుతున్న చొరవను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

