నేడు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్
భద్రాచలం – దివిటీ (మార్చి 3)
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నేడు (మార్చి 3) నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.