నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్ జి.వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 3)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (3వ తేదీ) జరుగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నందున జిల్లా అధికార యంత్రాంగమంతా ఆ కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉండటం వల్ల సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాబట్టి జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించి దరఖాస్తులు ఇవ్వడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.