అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్న ఎమ్మెల్యే
✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 14
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు 15వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు బూర్గంపాడు రైతువేదికలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ సమీక్ష నిర్వహించనున్నట్లు బూర్గంపాడు ఎంపీడీఓ జమలారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

