సీఎంను ‘అలయ్ బలయ్’ కు ఆహ్వానించిన దత్తాత్రేయ
✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 14
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (సీఎం) ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగనున్న “అలయ్ బలయ్” కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

