Divitimedia
BusinessDELHIHyderabadNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

బకాయిలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం

బకాయిలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం

కేంద్రమంత్రితో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ

✍️ హైదరాబాద్, న్యూఢిల్లీ – దివిటీ (మార్చి 4)

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94కోట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రాష్ట్రం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును పొడిగించాలని కూడా వారు కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

భద్రాద్రి రాముడి 56రోజుల ఆదాయం రూ.1.818 కోట్లు

Divitimedia

ఇంజినీరింగ్ పనులన్నీ ఏప్రిల్ 10లోగా పూర్తి చేయకపోతే చర్యలు

Divitimedia

జిల్లాలో ఓటరు జాబితాలో సవరణలకు 6,418 దరఖాస్తులు

Divitimedia

Leave a Comment