Divitimedia
HanamakondaHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaTravel And TourismWarangal

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

✍️ వరంగల్ – దివిటీ (నవంబరు 19)

వరంగల్ నగరంలో నిర్మించిన కాళోజీకళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆ కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీని, అక్కడ తొలిప్రదర్శనగా వారి జీవితంలోని ఘట్టాలను గుర్తుచేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు. డిజిటల్ పద్ధతిలో అక్కడి నుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

సంపూర్ణత అభియాన్ పనులు పరిశీలించిన డాక్టర్ యోగితారాణా

Divitimedia

‘మినిమమ్ వేజెస్ బోర్డ్’ మెంబర్ గా యారం పిచ్చిరెడ్డి

Divitimedia

బెల్లంపల్లిలో ఘనంగా ఏబీ బర్ధన్ 8వ వర్ధంతి కార్యక్రమం

Divitimedia

Leave a Comment