Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleSpot NewsTelanganaYouth

గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

4.9కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ సీజ్

✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 12)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డొంకరాయి పరిసర ప్రాంతాల నుంచి కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోని రుద్రంపూర్ కు నిషేధిత గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ముగ్గురు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం… రుద్రంపూర్ తండాకు చెందిన బోడ శివ, జూలూరుపాడు మండలానికి చెందిన వనమాల వేణు, మరొక మైనర్ ను రామవరం ఎస్సీబీనగర్ గోధుమ వాగు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,21,325 విలువగల 4.9కిలోల గంజాయి, ఒక బజాజ్ పల్సర్ వాహనం, ఒక సెల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.

Related posts

పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Divitimedia

విద్యార్థులకు ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

Divitimedia

ఘోరంగా వైద్య,ఆరోగ్య సిబ్బంది పనితీరు…

Divitimedia

Leave a Comment