Divitimedia
Andhra PradeshBhadradri KothagudemEducationEntertainmentHyderabadLife StyleNational NewsSportsSpot NewsTelanganaTravel And TourismYouth

రెండోరోజు ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ మ్యాచ్‌లు

రెండోరోజు ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ మ్యాచ్‌లు

69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు


✍️ దివిటీ మీడియా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారం గ్రామంలో నిర్వహిస్తున్న 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన రెండో రోజు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. తెలంగాణ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో మారుమూల గిరిజన ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయి విద్యా సంస్థల జట్లు అత్యంత పోటాపోటీగా తలపడుతూ విజయం కోసం హోరాహోరీగా పోరాడాయి.
ఉదయం సెషన్‌లో మధ్యప్రదేశ్ 50–40తో పంజాబ్‌పై, విద్యాభారతి 55–40తో కేవీఎస్‌పై, ఒడిశా 52–43తో చండీగఢ్‌పై గెలుపు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ 70–43తో త్రిపురపై ఘన విజయం సాధించగా, పుదుచ్చేరి 60–46తో సీఐఎస్‌సీఈను మట్టికరిపించింది. తెలంగాణ జట్టు 46–40తో తమిళనాడుపై విజయం సాధించగా, కర్ణాటక 40–35తో ఢిల్లీని, మహారాష్ట్ర 41–34తో హిమాచల్ ప్రదేశ్‌ను ఓడించాయి. రాజస్థాన్ జట్టు 34–22 తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలుపొందింది.

మధ్యాహ్నం సెషన్‌లో హర్యానా 71–25తో కేవీఎస్‌పై ఆధిపత్యం చూపింది. మధ్యప్రదేశ్ 52–35తో ఎన్వీఎస్‌ను, మణిపూర్ 49–34తో జార్ఖండ్‌ను, సీబీఎస్‌ఈ 39–35తో పశ్చిమ బెంగాల్‌ను ఓడించాయి. గుజరాత్ 38–32తో జమ్మూ & కాశ్మీర్‌పై, కేరళ 39–35తో సీబీఎస్‌ఈ వెల్ఫేర్‌పై గెలుపొందాయి. ఉత్తరప్రదేశ్ 34–32తో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సాధించగా, విద్యాభారతి 49–38తో అస్సాం, పంజాబ్ 59–34తో ఎన్వీఎస్‌పై ఘన విజయాలు సాధించాయి.

రెండో రోజు మ్యాచ్‌లలో ఆటగాళ్లు ప్రదర్శించిన శక్తి, నైపుణ్యం, వ్యూహాత్మక ఆటతీరు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. రాబోయే రోజుల్లో ఈ పోటీలు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగనున్నాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

Divitimedia

రేపట్నుంచి రాష్ట్ర ఫుట్ బాల్ జట్టు కోచింగ్ క్యాంప్

Divitimedia

బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్

Divitimedia

Leave a Comment