Divitimedia
BusinessCrime NewsHyderabadLife StyleMahabubabadSpot NewsTelangana

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ

✍️ మహబూబాబాద్ – దివిటీ (జూన్ 18)

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రోజురోజుకూ లంచావతారాలపై  దాడులు ఉద్ధృతం చేస్తోంది. తాజాగా బుధవారం ఓ ఉన్నతస్థాయి అధికారిని   మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. ఆ సంస్థ అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి… తెలంగాణ ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్)లో పని చేస్తున్న మహబూబాబాద్(జిల్లా) సర్కిల్  ఎస్ఈ నరేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. తన పరిధిలోని కురవి, మరిపెడ సబ్-డివిజన్ల కు సంబంధించి ప్రస్తుతం ఉన్న అంగీకార పత్రాలకు సంబంధించిన అగ్రిమెంట్లను  కొనసాగేలా ఆమోదం తెలపడానికిగాను  అధికారికంగా సహయం చేసేందుకు ఆ లంచం తీసుకుంటున్న క్రమంలో ఆయన పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుని నుంచి రూ.1లక్ష లంచం డిమాండ్ చేసిన నరేష్, అందులో బాగంగా ఇప్పటికే రూ.20వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడి చేశారు. మిగిలిన రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏసీబీ  విడుదల చేసిన ప్రకటనలో ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగిన పక్షంలో ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేసి సమాచారం అందించాలని” కోరారు. అంతేకాకుండా సామజిక మాధ్యమాలైన “వాట్సాప్ (నెం. 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB)లతోపాటు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని  సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
“ఫిర్యాదుధారుల, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా హామీ ఇచ్చారు.

Related posts

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ 

Divitimedia

పినపాక అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ కోసం ఈవీఎంలు సిద్ధం

Divitimedia

పుష్ప సినిమా నటుడు జగదీశ్ పై కేసు నమోదు, అరెస్టు

Divitimedia

Leave a Comment