కోల్ ట్రాన్స్ పోర్టర్స్ నూతన కమిటీ ఎన్నిక
✍️ మణుగూరు – దివిటీ (మార్చి 23)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్టర్స్ ఆసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. మణుగూరులోని కిన్నెర కల్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు ఆసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రెసిడెంట్ గా ఎం.చందర్రావు, సెక్రెటరీగా ఎ.ప్రసాద్, ట్రెజరర్ గా కె.ఆర్. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా ఎం.రాజేష్, జాయింట్ సెక్రటరీగా దిలీప్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆసోసియేషన్ సభ్యులు అందరికీ ఈ సమాచారం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.