Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTechnologyTelanganaYouth

మా పెద్దలకు మేమే చదువు నేర్పిస్తాం…

మా పెద్దలకు మేమే చదువు నేర్పిస్తాం…

రామవరంలో హెచ్ఎం వినూత్న విద్యాపథకం

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 19)

రోజంతా బడిలో విద్యార్థులు… ఆ తర్వాత ఇళ్లకు వెళ్లగానే వారే గురువులు… అదేంటని ఆశ్ఛర్యపోతున్నారా?… ఇది నిజంగా నిజమేనండీ… ఓ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేసిన వినూత్న
ఆలోచన ఈ సరికొత్త విద్యాపథకానికి పూర్వ వైభవం తీసుకొస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మండల పరిధిలోని రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ప్రభుదయాల్ ఓ వినూత్న విద్యా పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆ పాఠశాల విద్యార్థుల్లో నిరక్షరాసులైన తల్లిదండ్రులను గుర్తించి, వారి పిల్లల ద్వారానే పెద్దలకు చదువు నేర్పించేలా ఈ పథకం రూపొందించారాయన. అందుకు అవసరమైన పలకలు, బలపాలు అందించి, రోజూ కొంత సమయం తమ తల్లిదండ్రులకు చదువు నేర్పించేందుకు కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. కనీసం రాయడం, చదవడం నేర్పాలని కోరారు. ఉత్సాహంతో పలకలు బలపాలు తీసుకున్న ఆ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు చదువు నేర్పిస్తామంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ పథకం వల్ల నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యాగంధం సోకనుంది.

Related posts

విలువలతో కూడిన ప్రజోపయోగ జర్నలిజం సాగించాలి

Divitimedia

జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

Divitimedia

‘ఈపీఎఫ్’ సమస్యపై కేంద్రమంత్రులకు లేఖ రాసిన వైఎస్ షర్మిలారెడ్డి

Divitimedia

Leave a Comment