Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsYouth

రెసిడెన్షియల్ స్కూలులో దీపావళి జరిపిన ఎంఈఓ

రెసిడెన్షియల్ స్కూలులో దీపావళి జరిపిన ఎంఈఓ

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 1)

పాత కొత్తగూడెంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించే అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో తమ కుటుంబసభ్యులతో కలిసి కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్. ప్రభుదయాల్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ పాఠశాలలో నిరుపేద పిల్లలు, వీధిబాలురు, పాక్షికంగా అనాథలైన, బడి మానేసి బయట తిరుగుతున్న బాలల కోసం రెసిడెన్షియల్ బోధన చేస్తున్నారు. ఆ చిన్నారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న ఈ పాఠశాలలో దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలలకు స్వీట్లు, సబ్బులు పంపిణీ చేసిన అనంతరం మండల విద్యాశాఖాధికారి ప్రభుదయాల్ కుటుంబ సభ్యులు వారితో కలిసి బాణసంచా కాల్చి దీపావళి సంబరంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని ఆస్వాదించిన విద్యార్థులు ఆనందపడ్డారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇకనుంచి ప్రతి ఆదివారం గోదావరి నది హారతి

Divitimedia

అనుమాస్పదస్థితిలో యువకుడి మృతి

Divitimedia

కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Divitimedia

Leave a Comment