Divitimedia
Spot News

నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం (మే 17)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 18వ తేదీ (శనివారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ ప్రసూనరాణి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగూడెంలో జిల్లా ప్రజాపరిషత్ సమావేశమందిరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) సభ్యులు, జిల్లా పరిషత్ కో -ఆప్టెడ్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, శాశ్వత ఆహ్వానితులు, సంబందిత జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

Related posts

సైబర్ మోసాలు, నేరాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

Divitimedia

ప్రైవేటు ఏజెన్సీ గుప్పిట్లో ‘ధరణి’ పోర్టల్…

Divitimedia

భద్రాద్రి రాముడి 56రోజుల ఆదాయం రూ.1.818 కోట్లు

Divitimedia

Leave a Comment