Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleTelanganaWomenYouth

జూనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు

జూనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు

✍️ దివిటీ మీడియా – అశ్వాపురం (ఏప్రిల్ 24)

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన షేక్ రూబీనా రాష్ట్రస్థాయి అత్యుత్తమ ప్రతిభ చూపింది. కొత్తగూడెంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతూ, ఎంపీసీ గ్రూపులో 467/470 రాష్ట్రస్థాయి మార్కులు సాధించింది. తన తండ్రి షేక్ రియాజ్ జిరాక్స్ సెంటర్ నడుపుతూ చదివించారు. ఈ సందర్భంగా పలువురు పరిచయస్తులు, స్థానిక ప్రముఖులు రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించినందుకు ఆమెకు, కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.

Related posts

ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ పాలాభిషేకం

Divitimedia

గిరిజన మహిళా సమాఖ్యలతో ఇసుక ర్యాంపులు

Divitimedia

రుణమాఫీపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం

Divitimedia

Leave a Comment