వన్ టౌన్ పీఎస్ ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍🏽 దివిటీ – కొత్తగూడెం నేరవిభాగం (జనవరి 17)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించడంతోపాటు అధికారులను పలు కేసుల వివరాలడిగి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో నిరంతరం పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఉండాలని ఆయన సూచించారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి, బాధితులకు న్యాయం చేకూర్చాలని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
