Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

ఐడీఓసీలో వివేకానందుడికి నివాళులర్పించిన అధికారులు

ఐడీఓసీలో వివేకానందుడికి నివాళులర్పించిన అధికారులు

✍🏽 దివిటీ – కొత్తగూడెం (జనవరి 12)

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు, పలు శాఖల అధికారులు వివేకానందుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, స్వామి వివేకానందుని స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరు వారిలోని శక్తి, సామర్ధ్యాలు సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని, సమాజానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పరంధామ రెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి సులోచనరాణి, డీపీఆర్ఓ శ్రీనివాసరావు, డీసీఓ, వివిధ క్రీడాసంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Divitimedia

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక యాప్ విడుదల చేసిన పోలీసుశాఖ

Divitimedia

సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లా కలెక్టర్

Divitimedia

Leave a Comment