Divitimedia
Spot News

నేడు మంత్రి పొంగులేటి సింగరేణి ఎన్నికల ప్రచారం

నేడు మంత్రి పొంగులేటి సింగరేణి ఎన్నికల ప్రచారం

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం (డిసెంబర్ 24)

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఐ.ఎన్.టి.యు.సి కార్మిక యూనియన్ కు మద్దతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలను క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా ఉదయం 7 గంటలకు ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు పట్టణంలో, ఉదయం 9.30 గంటలకు కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణంలో సింగరేణి కార్మికులను కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో, సాయంత్రం 6.30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలంలో సింగరేణి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Related posts

పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం

Divitimedia

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించిన కలెక్టర్

Divitimedia

వరదల్లో ప్రాణరక్షణ కోసం అగ్రికల్చర్ డ్రోన్లు

Divitimedia

Leave a Comment