Divitimedia
HealthHyderabadSpot NewsTelangana

రెండో ఏఎన్ఎంల డిమాండ్లపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

రెండో ఏఎన్ఎంల డిమాండ్లపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ (జి) విభాగం శనివారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రెండో ఏఎన్ఎం ల పరిస్థితులు, డిమాండ్లపై అధ్యయనం కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం రిజ్వి శనివారం    మెమో నం.7716/జి/2023-1 ద్వారా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఛైర్ పర్సన్ గా, పబ్లిక్  హెల్త్ డైరెక్టర్ మెంబర్ కన్వీనరుగా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరో సభ్యుడిగా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన సిఫార్సులతోపాటు వివరణాత్మక నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Related posts

భద్రత కరవైన బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం

Divitimedia

అర్బన్ రెసిడెన్షియల్ స్కూలుకు క్రీడా సామగ్రి అందజేత

Divitimedia

అతని కన్నుపడితే బంగారం మాయమేనా…

Divitimedia

Leave a Comment