వేడుకగా కట్టమైసమ్మతల్లి బోనాల పండుగ


✍️ దివిటీ మీడియా (భద్రాచలం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో సందరయ్యనగర్ లోని శ్రీ బంగారు మైసమ్మతల్లి బోనాల పండుగ ఆదివారం భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొక్కిన కోరికలు తీర్చే బంగారు మైసమ్మతల్లికి తమను చల్లగా చూస్తుందని విశ్వసించే భక్తులు మైసమ్మ తల్లికి భక్తితో బోనాలు సమర్పించారు. ఆ బంగారు మైసమ్మతల్లి తమను చల్లగా చూడాలని, లోకమంతా సుభిక్షంగా విల సిల్లాలని మొక్కుకున్నారు. ఆలయంలో నిర్వాహకులు లక్ష్మి భక్తులకు ఏర్పాట్లు, ప్రత్యేక పూజలు చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

