Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

కూలిన చెరువుసింగారం పాఠశాల గోడ

✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 19)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మారుమూల గిరిజన గ్రామం చెరువుసింగారంలో చిన్నారులకు ప్రమాదం తప్పింది. ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం గోడ ఓవైపు సోమవారం రాత్రి కూలిపోయింది. పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఈ భవనం గోడలు నీటికి నానిపోయాయి. ఒకవైపు గోడ కూలడంతోపాటు భవనం స్లాబ్ కూడా శిథిలావస్థలో ఉంది. ఈ గోడ కూలిన సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని మంగళవారం ఆ గ్రామం సందర్శించిన
సీపీఎం బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లుకు చెరువుసింగారం గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాలాప్రమాదం తప్పిందని, గతంలో ఈ సమస్య అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామని వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీడీఏపీఓ, ఐటీసీ మేనేజ్మెంట్, కలెక్టర్ చొరవ చూపి
ఈ పాఠశాల సమస్య పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ స్కూలుకు కొత్త భవనం నిర్మించాలని, లేని యెడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు, పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. మారుమూల చెరువుసింగారం గ్రామాన్ని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని, ఆ గ్రామ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఆ గ్రామానికి రోడ్డు సక్రమంగా లేదని, మట్టిరోడ్డు బురదతో టీచర్లు, అంగన్వాడీ టీచర్లు ఆ గ్రామం పోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గ్రామ ప్రాథమిక పాఠశాల భవనం వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
సర్ప సత్యనారాయణ, ఈసం సురేష్, సర్ప రాజు, సోయం వీరస్వామి, సున్ను లక్ష్మయ్య, సర్ప రాజురత్నం, మడకం ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటర్మీడియట్ పరీక్షకేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

మార్చి 19లోగా రాజకీయ పార్టీలతో సమావేశాలు పూర్తిచేయాలి

Divitimedia

సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు తప్పవు

Divitimedia

Leave a Comment