Divitimedia
Bhadradri KothagudemDELHIHyderabadKhammamLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

స్ట్రాంగ్ రూం పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి

స్ట్రాంగ్ రూం పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి

✍️ ఖమ్మం – దివిటీ మీడియా (మే 23)

ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ వద్దనున్న కిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమును కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గురువారం పరిశీలించారు. ఓట్ల లెక్కింపునాటి వరకు ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రతపై అక్కడున్న సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. రఘురాంరెడ్డి వెంట రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ప్రధాన ఎలక్షన్ ఏజెంట్ తుళ్లూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ నాయకులు కొప్పుల చంద్రశేఖరరావు, నరాల నరేష్ కూడా ఉన్నారు.

Related posts

మధ్యంతర బెయిల్ తో చంద్రబాబుకు ఊరటనిచ్చిన ఏపీ హైకోర్టు

Divitimedia

ఏపీ ప్రభుత్వం – గూగుల్ మధ్య కీలక ఒప్పందం

Divitimedia

సికిల్ సెల్ అనీమియా శాశ్వతంగా నివారించాలి

Divitimedia

Leave a Comment