ఐటీసీ-రోటరీక్లబ్ ఆధ్వర్యంలో నర్సులకు సన్మానం

✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు (మే 11)
ఇంటర్నేషనల్ నర్స్ డే సందర్భంగా సారపాకలోని ఐటీసీ అనుబంధ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ఆధ్వర్యంలో శనివారం భద్రాచలం ఏరియా హాస్పిటల్ నర్సులను సన్మానించారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో సేవలదిస్తున్న 25 మంది నర్సులకు వారి సేవలను గుర్తించి ఘనసన్మానం చేశారు. ఈ సందర్బంగా రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్, సభ్యులు సత్యనారాయణ, నాగమల్లేశ్వరరావు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ పంచిపెట్టారు. తమను గుర్తించి గౌరవించినందుకు నర్సులు ఆనందం వ్యక్తం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

