Divitimedia
Life StyleNalgondaPolitics

గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి

గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి

టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి

✍🏽 దివిటీ మీడియా – సూర్యాపేట

ప్రజలందరికీ విఘ్నాధిపతి గణనాధుని ఆశీస్సులు ఉండాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. శాలిగౌరారం మండలంలోని ఉట్కూర్ గ్రామంలో వినాయక మండపాల వద్ద సోమవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయకుని నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రతిఒక్కరూ భక్తిభావం చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు పాకాల సతీష్, మాదారం ఎంపీటీసీ సభ్యుడు నోముల జనార్ధన్ యాదవ్, ఆకారం సర్పంచ్ సమరంరెడ్డి, ఊట్కూర్ గ్రామశాఖ అధ్యక్షుడు కుర్ర లింగయ్య, వార్డ్ మెంబర్ గుండ్లు వినోద-సైదులు, ఎన్ ఎస్ యు ఐ మండల ఉపాధ్యక్షుడు కట్లకుంట్ల రమేష్, మోదాల రమేష్, సీనియర్ నాయకులు రంగు రాములు,కప్పల శ్రీకాంత్, భూపతి శ్రీనివాస్, శీలం శంకర్, రంగు బిక్షం, వేముల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Divitimedia

అరకొర జీతం… అర్థరాత్రి కూడా తప్పని పని భారం…

Divitimedia

రేపు “నేషనల్ స్పోర్ట్స్ డే” వేడుకల్లో పాల్గొనండి: డీవైఎస్ఓ

Divitimedia

Leave a Comment