నామినేషన్లు దాఖలు చేసిన బూసిరెడ్డి అభ్యర్థులు
✍️ దివిటీ – బూర్గంపాడు(నవంబరు29)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రముఖ సామాజికవేత్త బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఆశీస్సులతో ఆయన అనుచరులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీచేస్తున్న ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని బానోత్ రాజి, వార్డు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మద్దెబోయిన నాగమణి, గాదె పెద్దిరెడ్డి, మిరియాల మంగమ్మ, బానోతు శంకర్, తేజావత్ జ్యోతి, బానోత్ భాస్కర్, బానోత్ గణేష్ తన మద్దతుతో నామినేషన్లు దాఖలు చేసినట్లు శంకర్ రెడ్డి ప్రకటించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసిన బానోతు రాజి అభ్యర్థిత్వాన్ని సూరెడ్డి సందారెడ్డి బలపరిచారు. సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో దౌపాటి రామకృష్ణ, దీపంగి రామచందర్, చిలంకూరి భాస్కర్, మారం రామచంద్రారెడ్డి, మదమంచి రాజేష్, తదితరులు ర్యాలీగా పాల్గొన్నారు

