మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

భరోసా సెంటర్ ఎస్సై చల్లా అరుణ
✍️ దివిటీ – కొత్తగూడెం (18 నవంబరు)
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ రక్షణకు ఆ చట్టాలను వినియోగించుకోవాలని జిల్లా భరోసా సెంటర్ ఎస్సై చల్లా అరుణ కోరారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె భరోసా సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలు, పోక్సో చట్టం, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ, తదితర అంశాలు వివరించారు. ఈ సందర్భంగా భరోసా బృందానికి చెందిన కో-ఆర్డినేటర్ రేణుక, లీగల్ సపోర్ట్ పర్సన్ శిరీష, సభ్యులు అంబికా, రమాదేవి, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ సంధ్యారాణి, రిసెప్షనిస్ట్ అనూష తమ తమ బాధ్యతలు, అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య అధికారి డా.ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి అనూరాధ, మహిళ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖాధికారులు, సిబ్బంది, సఖి సిబ్బంది, మహిళా సాధికరికత కేంద్రం సిబ్బంది, ఆశావర్కర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

