Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTechnologyTelangana

బూర్గంపాడులో 29న “భూభారతి” అవగాహన సదస్సు

బూర్గంపాడులో 29న “భూభారతి” అవగాహన సదస్సు

✍️ బూర్గంపాడు – దివిటీ (ఏప్రిల్ 28)

బూర్గంపాడు మండల రైతు సోదరులకు ‘భూభారతి చట్టం-2025’ పై అవగాహన కల్పించేందుకు మంగళవారం మండల కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నట్లు
తహసీల్దారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ఈ సదస్సులో నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారం, భూహక్కుల భద్రత, భరోసా కోసం ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు చేస్తున్న నూతన ఆర్ఓఆర్ చట్టం(భూభారతి-2025) విధి విధానాలు, భూభారతి పోర్టల్ గురించిన
అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సదస్సు స్థానిక రైతువేదికలో జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి బూర్గంపాడు మండల రైతులు, రైతుసంఘ, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ బాధ్యులు, పుర ప్రముఖులు, మహిళా సమాఖ్య, ప్రజలు, పాత్రికేయులు హాజరు కావాలని ఆయన కోరారు.

Related posts

తహశీల్దారు కార్యాలయంలో క్రిస్మస్ కానుకల పంపిణీ

Divitimedia

ఏపీ, తెలంగాణ మధ్య ‘జల జగడం’…

Divitimedia

గంజాయి, మత్తు పదార్థాలు గుర్తించేందుకు పోలీస్ జాగిలాలు

Divitimedia

Leave a Comment