‘గిరిజన దర్బార్’ కు సకాలంలో హాజరు కావాలి : ఐటీడీఏ పీఓ
✍️ భద్రాచలం – దివిటీ (ఏప్రిల్ 27)
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెల 28న సోమవారం నిర్వహించనున్న ‘గిరిజన దర్బార్’ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని పీఓ కోరారు. గిరిజన దర్బారుకు సంబంధిత అన్ని విభాగాల అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.