సరూర్ నగర్ హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
✍️ రంగారెడ్డి – దివిటీ (మార్చి 26)
సరూర్ నగర్ లో అప్సర అనే యువతి హత్యకేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు జీవితఖైదు విధించింది. హత్యతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించాడని మరో ఏడేళ్ల శిక్ష విధించింది. 2023లో తీవ్ర సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో తాజా పరిణామాలివి… వివాహేతర సంబంధం నేపధ్యంలో తనను పెళ్ళి చేసుకోమని అస్పర తరచూ అడుగుతుండటంతో, ఆ యువతిని కారులో శంషాబాద్ తీసుకెళ్లి పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆమెన హత్య చేసిన సాయికృష్ణ శవాన్ని తన ఇంటి సమీపంలో డ్రైనేజిలో పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. హత్య విషయం ఎవరూ గుర్తించకూడదని, మ్యాన్హోల్ను మట్టితో నింపి, ఆ తర్వాత సిమెంట్తో మూసివేశాడు. ఈ కేసు దర్యాప్తు చేసి సరూర్ నగర్ పోలీసులు, సాక్ష్యాలు కోర్టు వారికి సమర్పించడంతో విచారణ జరిపి నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు మరో ఏడేళ్లజైలు శిక్ష విధించారు.