మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన నాయకులు

✍️ హైదరాబాద్ – దివిటీ (మార్చి 4)
అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పలువురు నాయకులు మంగళవారం స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మంత్రికి స్వాగతం పలికిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, మువ్వా విజయబాబు, పిడమర్తి రవి, రఘునాద్ యాదవ్, సామినేని చైతన్య, తదితరులున్నారు.