Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaYouth

గ్రూప్-3 పరీక్షల్లో మెహందీ, టాటూలు నిషిద్దం

గ్రూప్-3 పరీక్షల్లో మెహందీ, టాటూలు నిషిద్దం

ఏర్పాట్లు పూర్తయ్యాయన్న అదనపు కలెక్టర్

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 15)

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మెహందీ, టాటూలు
పెట్టకుండా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానం కారణంగా మెహందీ, టాటూలు పెట్టకుండా ఉండాలని ఆయన సూచించారు. ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలో 39 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 13478మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని ఆయన వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షల కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, బ్యాగులు తెచ్చుకోవడం నిషేధమని స్పష్టం చేశారు.

Related posts

రామవరం హైస్కూల్ సందర్శించిన డీఈఓ

Divitimedia

మద్దుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

Divitimedia

జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Divitimedia

Leave a Comment