మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ
✍️ మణుగూరు – దివిటీ (అక్టోబరు 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అడపా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్, గృహజ్యోతి పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుతోపాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అన్నిరంగాల్లో మహిళలు ముందుకుపోవాలన్నారు. ఉమ్మడి జిల్లాల మత్స్యశాఖ డైరెక్టర్ సిడెం నాగేశ్వరరావు, వీఓఏ మల్లికాంబ, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

