Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelanganaWomen

మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ

మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ

✍️ మణుగూరు – దివిటీ (అక్టోబరు 20)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అడపా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్, గృహజ్యోతి పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుతోపాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అన్నిరంగాల్లో మహిళలు ముందుకుపోవాలన్నారు. ఉమ్మడి జిల్లాల మత్స్యశాఖ డైరెక్టర్ సిడెం నాగేశ్వరరావు, వీఓఏ మల్లికాంబ, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Related posts

విధులలో మరణించిన హోంగార్డ్స్ ఆఫీసర్స్ కుటుంబాలకు అండగా ఉంటాం

Divitimedia

మణుగూరు మున్సిపాలిటీలో పరిస్థితి అస్తవ్యస్తం

Divitimedia

మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన నాయకులు

Divitimedia

Leave a Comment